అందుకే ఆ దేశాన్ని “పాకిస్థాన్” అంటారు..?

ఓ పక్క యుద్ధంలో ఉన్న అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామని చెబుతారు.. ఈ గ్యాప్ లో అమెరికాతో కలిసి ఇరాన్ పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ని దూషిస్తారు. ధైర్యం చాలకో ఏమో.. ఆ దూషణల ట్వీట్లు తొలగిస్తారు.

మరోవైపు ఇరాన్ దాడుల నుంచి సౌదీని కాపాడటానికి అక్కడ తమ సైన్యాన్ని మొహరిస్తారు.. ఎందుకయ్యా అంటే అది తమ మధ్య ఉన్న ఒప్పందం అని చెబుతారు.

తమ దేశానికి వచ్చే రెండు దేశాల ప్రతినిధులలో ఒకరిని మిలటరీ దుస్తుల్లో, మరొకరిని సూటు బూటులో ఆ దేశ అనధికారిక అధినేత రిసీవ్ చేసుకుంటారు.. ఈ వ్యత్యాసం దేనికంటే సమాధానం చెప్పరు.

ఉగ్రవాదులను పెంచి పోషిస్తారు.. వారిని భారత్ పైకి ఉసిగొల్పుతారు.. ఆ తర్వాత భారత్ వారితో పాటు, వారిని పెంచి పోషిషున్నవారి తాట తీసాక.. రివర్స్ ఆరోపణలు చేస్తారు.. అంతర్జాతీయ వేదికలపై లబోదిబో అంటారు.

పైకి చెప్పేది ఒకటి, ప్రపంచానికి చూపించేది మరొకటి, తెరవెనుక చేసేది ఇంకొకటి.

ఈ ప్రపంచంలో ఇన్ని క్వాలిటీస్ ఉన్న దేశం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదుగా… అదే పక్కనున్న పాకిస్థాన్!

అవును… ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో.. త్వరలో గతానికి మించి తీవ్రస్థాయిలో దాడులు ఉంటాయని అమెరికా బలంగా చెబుతోన్న తరుణంలో.. ఈ గ్యాప్ లో గల్ఫ్ దేశాల్లోని ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు కన్ ఫాం అని అంటున్న వేళ… పాకిస్థాన్ కూడా రంగ ప్రవేశం చేసింది.

ఈ సందర్భంగా స్పందించిన సౌదీ… ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందం కింద భద్రతను పెంచడానికి పాకిస్థాన్ యుద్ధ విమానాలను, ఇతర సైనిక బలగాలను తమ దేశానికి పంపిందని.. ఆ దేశ యుద్ధ విమానాలు, సహాయక విమానాలు దేశంలోని తూర్పు ప్రావిన్స్‌ లో ఉన్న కింగ్ అబ్దుల్ అజీజ్ వైమానిక స్థావరానికి చేరుకున్నాయని తెలిపింది. ఉమ్మడి రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రత, స్థిరత్వానికి మద్దతు ఇవ్వడమే పాకిస్తాన్ మోహరింపు లక్ష్యమని వెల్లడించింది.

అయితే… ఇరాన్ చేసే దాడుల నుంచి సౌదీని కాపడటానికి మాత్రమే పాక్ ప్రయత్నిస్తుందా.. లేక, తిరిగి ఇరాన్ పై దాడులు చేస్తుందా.. అంటే.. ముందుగా చెప్పుకున్నట్లుగానే అది పాకిస్థాన్.. పైకి చెప్పేది ఒకటి, వెనుక చేసేది మరొకటి అయ్యే అవకాశాలు పుష్కలం.

ఏది ఏమైనా… ఓ పక్క అమెరికా, మరోపక్క ఇజ్రాయెల్, ఈసారి గల్ఫ్ దేశాల ఎంట్రీ కూడా బలంగా ఉంటుందని చెబుతున్న వేళ, ఇంకోపక్క అమెరికా ప్రాపకం కోసం వెంపర్లాడే పాక్ ఎంట్రీ ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు ఏ మేరకు భయానకంగా మారబోతున్నాయనేది వేచి చూడాలి.

ఏది ఏమైనా, పశ్చిమాసియాలో యుద్ధం ఎన్ని రోజులు జరిగినా.. ఆర్థికంగా మరింత కుదేలైపోయే మొట్టమొదటి దేశం కచ్చితంగా పాకిస్థాన్ అనే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇప్పటికే ఆ దేశం ఆర్థిక పరిస్థితి అత్యంత పతనావస్థలో ఉంది మరి!