మూడో వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. ఆర్మీ క్యాప్ తో టిమిండియా ప్లేయర్లు

ఆస్ట్రేలియాతో శుక్రవారం రాంచీ వేదికగా మూడ‌వ వ‌న్డే జ‌ర‌గ‌ుతుంది. టాస్ గెలిచిన టీమిండియా మొద‌ట ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. ఇప్ప‌టికే 5 వ‌న్డేల సిరీస్‌లో భార‌త్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న విష‌యం తెలిసిందే. మ్యాచ్ ప్రారంభం కావ‌డానికి ముందు.. టీమిండియా ప్లేయ‌ర్లు కొత్త క్యాప్‌ను ధ‌రించారు.

పుల్వామా ఉగ్ర‌దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమ‌ర జ‌వాన్ల‌కు నివాళిగా మిలిట‌రీ రంగు టోపీల‌ను ధ‌రించి క్రికెట్ ప్లేయర్లు ఆడుతున్నారు. నేష‌న‌ల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాల‌న్న సందేశాన్ని కూడా ప్లేయ‌ర్లు ఇచ్చారు. అమ‌ర జ‌వాన్ల పిల్ల‌ల చ‌ద‌వు కోసం ఆ నిధుల‌ను వాడ‌నున్నారు. మాజీ కెప్టెన్ ధోనీ.. ప్లేయ‌ర్ల‌కు కొత్త క్యాప్‌ను అందించారు.