తొలి టీ20 మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఓటమి

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి T20 మ్యాచ్ లో  భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 159 పరుగులు చేసింది. భారత్ 160  పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ప్రారంభంలో బాగానే ఆడినా మధ్యలో మిడిలార్డర్ కుప్పకూలింది. దీంతో భారత్ 136 పరుగులకే ఆలౌటయ్యింది. భారత బ్యాట్స్ మెన్స్ స్మృతి మందనా 58, రోడ్రిగ్స్ 39 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లు లియా తహుహుకు 3 వికెట్లు దక్కాయి.  

కివీస్ బ్యాట్స్ మెన్స్ సోఫీ డివైన్ 62 పరుగులతో రాణించింది. భారత బౌలర్లు అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, దీప్తి, పూనమ్ ఒక్కో వికెట్ తీశారు. టాస్ గెలిచిన టిమిండియా కివీస్ కు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చారు. కివీస్ బౌలర్లను ఎదుర్కోలేక భారత బ్యాట్స్ మెన్స్ చేతులేత్తేశారు. దీంతో మొదటి మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది.