ఐపీఎల్-2020: ఢిల్లీ ఓటమి, ధావన్ శతకం వేస్ట్ ,వరుస విజయాలతో ప్లే ఆప్స్ కి దగ్గరవుతున్న పంజాబ్

punjab won the match against delhi

DC vs KXIP, దుబాయ్ : సీజన్‌లో బ్యాక్ టు బ్యాక్ విజయాల్ని అందుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన ప్లేఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 165 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలిన ఉండగానే పంజాబ్ టీమ్ 167/5తో ఛేదించేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (106 నాటౌట్: 61 బంతుల్లో 12×4, 3×6) సెంచరీ బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. ఛేదనలో నికోలస్ పూరన్ (53: 28 బంతుల్లో 6×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్‌కి క్రిస్‌గేల్ (29: 13 బంతుల్లో 3×4, 2×6), గ్లెన్ మాక్స్‌వెల్ (32: 24 బంతుల్లో 3×4) హిట్టింగ్ తోడవడంతో పంజాబ్ టీమ్ 5 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. తాజా సీజన్‌లో పదో మ్యాచ్‌ ఆడిన పంజాబ్‌కి ఇది నాలుగో విజయం‌కాగా.. ఢిల్లీకి ఇది మూడో ఓటమి.

punjab won the match against delhi
punjab won the match against delhi

ఛేదనలో పంజాబ్‌కి మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (15: 11 బంతుల్లో 1×4, 1×6) ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే ఔటవగా.. అనంతరం వచ్చిన క్రిస్‌గేల్ (29: 13 బంతుల్లో 3×4, 2×6) మెరుపులు ఒక ఓవర్‌కే పరిమితమయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే నికోలస్ పూరన్‌తో సమన్వయలోపం కారణంగా మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5 9 బంతుల్లో) రనౌటయ్యాడు. దాంతో.. 5.5 ఓవర్లు ముగిసే సమయానికి 56/3‌తో పంజాబ్ నిలిచింది. కానీ.. ఈ దశలో మాక్స్‌వెల్‌తో కలిసి దూకుడుగా ఆడిన నికోలస్ పూరన్ ఎడా పెడా బౌండరీలు బాదేశాడు. ఈ క్రమంలో మాక్స్‌వెల్‌తో కలిసి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన పూరన్.. జట్టు స్కోరు 125 వద్ద ఔటయ్యాడు. అప్పటికే మ్యాచ్ పంజాబ్ చేతుల్లోకి వచ్చేయగా.. ఆ తర్వాత మాక్స్‌వెల్ జోరందుకున్నాడు. చివర్లో దీపక్ హుడా (15: 22 బంతుల్లో 1×4), జేమ్స్ నీషమ్ (10 నాటౌట్: 8 బంతుల్లో 1×6) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.