మెల్ బోర్న్ వన్డేలో భారత్ లక్ష్యం 231 పరుగులు

మెల్ బోర్న్ లో జరుగుతున్న ఆఖరి వన్డేలో ఆసీస్ 230 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి 50 ఓవర్లు పూర్తిగా ఆడలేకపోయింది. 48.4 ఓవర్లలోనే ఆసీస్ 230 పరుగులకు ఆలౌటైంది. మూడు వన్డేల సిరిస్ లో భాగంగా 1-1 తో ఇరుజట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారినే కప్ వరించనుంది.

చాహాల్ అద్భుతమైన బౌలింగ్ తో ఆరు వికెట్లు తీశాడు. భువనేశ్వర్, షమీ కూడా ఆసీస్ బ్యాట్స్ మన్ కు చుక్కలు చూపించారు. ఆసీస్ బ్యాట్స్ మన్లలో కారీ 5, ఫించ్ 14, ఖావాజా 34, మార్ష్ 39, కాంబ్ 58, స్టోయిన్స్ 10, మాక్స్ వెల్ 26, రిచర్డ్ 16, జంపా 8 పరుగులు చేశారు. స్టాస్ లేక్ డక్కౌట్ అయ్యాడు. భారత్ 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.