మూడో 20-20 మ్యాచ్ లో భారత్ కు భారీ టార్గెట్ పెట్టిన న్యూజిలాండ్

భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో 20-20 మ్యాచ్ లో న్యూజిలాండ్ 20  ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. దీంతో భారత్ టార్గెట్ 213 పరుగులుగా నిర్దేశింపబడింది.  భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. న్యూజిలాండ్ బ్యాట్ మెన్స్ సైఫర్ట్ 43, మున్రో 72, విలియం సన్ 27, గ్రాండ్ హోం 30, మిచెల్ 19, టేలర్ 14 పరుగులు చేశారు. 

భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్ 2, కుమార్, అహ్మద్ తలో వికెట్ తీశారు. ఓపెనర్లు చాలా బాగా ఆడి శుభారంభం చేశారు. ఒకనొక దశలో భారత బౌలర్లకు వారు చుక్కలు చూపించారు. మూడు మ్యాచ్ ల సిరిస్ లో భాగంగా ఇప్పటికే ఈ సిరిస్ లో 1-1 తో రెండు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. దీంతో సిరీస్ పై ఇరు జట్లు కన్నేశాయి. రెండు జట్లు సిరీస్ గెలుచుకోవాలన్న కసితో ఆడుతున్నాయి. న్యూజిలాండ్ భారత్ కు భారీ టార్గెట్ నే నిర్దేశించింది.