మహిళల T-20 సిరీస్.. మొదటి మ్యాచ్ లో  భారత్ విజయలక్ష్యం 160 పరుగులు

న్యూజిలాండ్ తో జరుగుతున్న మహిళల ట్వంటీ ట్వంటీ మూడు వన్డేల సిరిస్ లో భాగంగా మొదటి వన్డే వెల్లింగ్టన్ లో ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా కివీస్ కు బ్యాటింగ్ ఆప్షన్ ఇచ్చింది. ముందుగా బ్యాటింగ్ కి దిగిన కివీస్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో భారత్ విజయలక్ష్యం 160 పరుగులుగా నిర్దేశించింది.

కివీస్ బ్యాట్స్ మెన్స్ సోఫీ డివైన్ 62 పరుగులతో రాణించింది. భారత బౌలర్లు అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, దీప్తి, పూనమ్ ఒక్కో వికెట్ తీశారు. న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-1 తో గెలుచుకుంది. ట్వంటి ట్వంటీ సిరీస్ ను కూడా గెలుచుకోవాలన్న తపనలో భారత్ ఉంది.