మహిళల T20 సిరీస్ కివీస్ కైవసం.. చేతులేత్తేసిన భారత మహిళా టీం

మూడో T20 లోనూ భారత మహిళలు చేతులేత్తేశారు. దీంతో ట్వంటీ ట్వంటీ సిరీస్ కివిస్ వశమైంది. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్ లో కేవలం రెండు పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. రెండు పరుగుల తేడాతో గెలిచిన కివీస్ క్లీన్ స్వీప్ గా సిరీస్ ను కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ 20 ఓవర్లలో 161 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయింది. భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. కేవలం రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత బ్యాట్ మెన్స్ మందాన 86, మిథాలీ రాజ్ 24, దీప్తి శర్మ 21 పరుగులు చేశారు. దీంతో సిరీస్ 3-0 తో క్లీన్ స్వీప్ గా కివీస్ గెలుచుకోగలిగింది.