మూడో T20 మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం… సిరీస్ కివీస్ కైవసం

టిమిండియా పై ఆఖరి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తో ట్వంటీ ట్వంటీ సిరీస్ ను కివీస్ గెలుచుకుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 212 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇండియా 208 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. కేవలం 4 పరుగుల తేడాతో ఇండియా సిరీస్ ను చేజార్చుకుంది. దీంతో భారత అభిమానులు నిరాశలో కూరుకుపోయారు.

భారత బ్యాట్ మెన్స్ ధావన్ 5, శర్మ 38, శంకర్ 43, పంత్ 28, హార్దిక్ పాండ్యా 21, ధోని 2, కార్తీక్ 33, పాండ్యా 26 పరుగులు చేశారు. టిమిండియా బ్యాట్ మెన్స్ కివీస్ బౌలర్లను ఎదుర్కో లేక చతికిలపడ్డారు. దీంతో భారత్ స్వల్ప తేడాతో ఓటమి పాలైంది.

న్యూజిలాండ్ బ్యాట్ మెన్స్ సైఫర్ట్ 43, మున్రో 72, విలియం సన్ 27, గ్రాండ్ హోం 30, మిచెల్ 19, టేలర్ 14 పరుగులు చేశారు.