నాలుగో వన్డేలో టిమిండియా ఘోర పరాజయం

ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఘోర పరాజయం పాలైంది. 93 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇప్పటికే భారత్ ఐదు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకుంది. నాలుగో వన్డేలో న్యూజిలాండ్ విజయంతో 3-1 గా మారింది. ఐదే వన్డే ఫిబ్రవరి 3 వ తేదిన జరగనుంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ను కివీస్ బౌలర్లు పూర్తిగా కట్టడి చేశారు. టీమిండియా బ్యాట్స్ మెన్లలో ఏడుగురు కనీసం రెండంకెల స్కోరును కూడా సాధించలేకపోయారు. చాహల్ చేసిన 18 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. రోహిత్ శర్మ 7, ధావన్ 13, శుభ్ మన్ గిల్ 9, రాయుడు 0, కార్తీక్ 0, జాదవ్ 1, పాండ్యా 16, భువనేశ్వర్ 1, కుల్దీప్ యాదవ్ 15, చాహల్ 18, కేకే అహ్మద్ 5 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 5, గ్రాండ్ హోమ్ 3 వికెట్లు తీయగా… ఆస్లే, నీషమ్ లు చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 14 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే లక్ష్యం చిన్నది కావడంతో అలవోకగా తెలుపొందింది. గుప్టిల్ 14, విలయంసన్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. వీరిద్దరినీ భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు. నికోల్స్ 30, టేలర్ 37 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 21 పరుగులకు 5 వికెట్లు తీసిన బౌల్ట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.