నాలుగో వన్డేలో 92 పరుగులకు భారత్ ఆలౌట్,  న్యూజిలాండ్ టార్గెట్ 93 పరుగులు

న్యూజిలాండ్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ కుప్పకూలింది. హామిల్టన్ వన్డేలో కివీస్ బౌలర్ల దెబ్బకు భారత బ్యాట్స్ మెన్ చేతులేత్తేశారు. 30.5 ఓవర్లలో భారత్ 92 పరుగులకు ఆలౌటయ్యింది. న్యూజిలాండ్ టాస్ గెలిచినా ముందుగా భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. ధావన్ 13, రోహిత్ శర్మ 7, రాయుడు డకౌట్, దినేష్ కార్తీక్ డకౌట్, జాదవ్ 1, గిల్ 9, భువనేశ్వర్ 1, చాహల్ 18, పాండ్యా 16, కుల్డీప్ 15 పరుగులు చేశారు.

న్యూజిలాండ్ బౌల‌ర్స్‌లో బౌల్ట్ 5 వికెట్లు తీయ‌గా, గ్రాండ్‌ హోమ్ మూడు వికెట్లు తీశారు. ఆస్టల్, నిషమ్ ఒక్కో వికెట్ తీశారు.  ఈ వ‌న్డే రోహిత్ శ‌ర్మ‌కి 200వ‌ది కావ‌డం విశేషం. 93 పరుగుల విజయ లక్ష్యంతో న్యూజిలాండ్ బరిలోకి దిగింది.