మూడో వన్డేలో టిమిండియా లక్ష్యం 314 పరుగులు

భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టిమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 313 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది.  ఆసీస్ బ్యాట్ మెన్స్ పించ్ 93, కవాజా 104, మ్యాక్స్ వెల్ 47, మార్స్ 7, పీటర్ 0  , స్టెయినిస్ 31, కారే 21  పరుగులు  చేశారు. భారత బౌలర్లు  కుల్దీప్ 3, షమీ 1 వికెట్లు తీశారు. ఇప్పటకే ఐదు వన్డేల సిరిస్ లో భారత్ 2-0 తో ఆధిక్యంలో ఉంది.