ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ముచ్చట రాగానే పాలిటిక్స్ అప్పుడే నెక్స్ట్ లెవెల్కు షిఫ్ట్ అయిపోయాయి. మొన్నటి దాకా పవర్లో ఉన్నప్పుడు “మా పోలీసులు సూపర్.. కేంద్ర బలగాలు ఎందుకు దండగ?” అన్నట్లుగా కోర్టుల దాకా వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కి.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే కేంద్ర బలగాలు లేకపోతే ముద్ద దిగేలా లేదు. “బాబోయ్.. కూటమి ప్రభుత్వం మమ్మల్ని అసలు నామినేషన్లు కూడా వేయనివ్వదు, మాకు సెంట్రల్ ఫోర్సెస్ కావాల్సిందే” అంటూ ఢిల్లీ పెద్దలకు అర్జీలు పెట్టుకుంటున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ ఆర్మీ ఊసే ఎత్తని వాళ్లకు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే మిలిటరీ ఎంత ముద్దుగా కనిపిస్తోందో కదా అని సామాన్య జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. అసలు కేంద్ర ప్రభుత్వం వీళ్లు అడిగిన వెంటనే బలగాలను పంపించేస్తుందా..? అనేది పెద్ద డౌట్. ఇప్పుడు ఢిల్లీలో సీన్ చూస్తే.. నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర సర్కార్ నిలబడాలన్నా, నడవాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 16 మంది ఎంపీల సపోర్ట్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బాబుగారి దయ మీదే ఢిల్లీ పీఠం డిపెండ్ అయి ఉన్న ఈ రోజుల్లో.. రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేకుండా కేంద్ర హోంశాఖ ఏపీకి బలగాలను పంపించే సాహసం చేస్తుందా..? “అయ్యా మోదీ గారు.. మాకు రక్షణ లేదు, మీ బలగాలను పంపండి” అని జగన్ మోహన్ రెడ్డి గారు అడిగితే.. మోదీ గారు ఏమో చంద్రబాబు గారి వైపు చూసి “ఏమంటారు బాబుగారూ.. పంపమంటారా..? వద్దా..?” అని సైగలు చేసే సీన్ కళ్లముందు కనిపిస్తోందని పొలిటికల్ సర్కిల్స్లో తెగ జోకులు పేలుతున్నాయి.
నిజానికి ఇక్కడ ఏ ఒక్కరినీ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఒకపక్క కూటమి ప్రభుత్వం తాము అధికారంలో ఉన్నాం కాబట్టి.. “రాష్ట్ర పోలీసులు చాలు, వేరే వాళ్లు ఎందుకు?” అంటూ ప్రతిపక్షాల డిమాండ్ను లైట్ తీసుకుంటోంది. కానీ, గతంలో తాము చేసిన తప్పులే ఇప్పుడు తమకు శాపంగా మారుతుంటే వైసీపీ తమ్ముళ్లు మాత్రం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అంతిమంగా కేంద్ర ప్రభుత్వం తన మిత్రపక్షమైన చంద్రబాబు గారి మాట వింటుందా, లేక ప్రజాస్వామ్యాన్ని కాపాడే నెపంతో జగన్ గారి అభ్యర్థనను మన్నిస్తుందా అనేది చూడాలి. ఏదేమైనా, “అధికారంలో ఉన్నప్పుడు ఒక రూల్.. ప్రతిపక్షంలోకి రాగానే మరో రూల్” అనే పాలిటిక్స్ చూసి పబ్లిక్ మాత్రం ఫుల్లుగా ఎంటర్టైన్ అవుతున్నారు.