ఆ సినిమా షూటింగులో నటి టబుకు తీవ్ర గాయాలు.. ఏకంగా గాజు ముక్కలే!

టబు ఒక భారతీయ నటిగా అందరికీ సుపరిచితమే. ఈమె తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో నటించింది. ఈమె 1991 లో విడుదలైన కూలీ నెంబర్ వన్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఇక తెలుగులో నిన్నే పెళ్ళాడుతా, ఆవిడ మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి అందరివాడు లాంటి చిత్రాల ద్వారా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

టబు నటించిన తమిళ మూవీ ప్రేమదేశం తెలుగులో డబ్బింగ్ కాగా.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తెలుగులో చివరగా అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో సినిమాలో కీలక పాత్ర పోషించింది. వరుస అవకాశాలతో దక్షిణ భారతదేశంలోని అగ్ర నటిగా మంచి గుర్తింపు పొందింది.

ఇక అసలు విషయానికి వస్తే బాలీవుడ్ స్టార్ హీరో అయిన అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భోలా మూవీ సెట్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సినిమాలో టబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది.

ట్రక్కును బైక్స్ తో చేజ్ చేసే సీన్ షూట్ చేస్తున్న టైంలో ప్రమాదం జరగడంతో నటి టబుకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. ట్రక్కు అద్దాలు పగిలి.. ట్రక్కు లోపల ఉన్న టబుకు గాజు ముక్కలు గుచ్చుకోవడం జరిగింది. దీంతో ఆమె కుడి కన్నుపై గాయమైనట్లు సమాచారం.

ఇక వెంటనే ఆమెను సెట్స్ లో ఉన్న డాక్టర్ తో ట్రీట్మెంట్ చేయించారు. అయితే ఆ గాయానికి ఎలాంటి కుట్లు అవసరం లేదని వైద్యులు చెప్పారు. అక్కడే సెట్స్ లో అజయ్ దేవగన్ వెంటనే స్పందించి.. షూటింగ్ కు చిన్న విరామం ప్రకటించారు. టబును రెస్ట్ తీసుకోవాలని సూచించారు. పెద్ద ప్రమాదం జరగకపోవడంతో మూవీ యూనిట్ ఊపిరి పీల్చుకుంది.

టబుకు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం ఈమె ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు సూచించారు. ఇక ఈ చిత్రం 2023 మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.