Zaheerabad: ప్రేమికుల రోజున ప్రియుడు ఏకాంత మంటూ.. ఏం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Zaheerabad: సాధారణంగా ఫిబ్రవరి 14 అనగా ప్రేమికుల దినోత్సవం. ఆ రోజున ప్రేమికులు తల్లిదండ్రులు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నపటికీ ప్రేమికుల దినోత్సవం రోజు మాత్రం ఏ ప్రేమికుల జంట అయిన కలవాల్సిందే. ఈ క్రమంలో ఎన్నో గిఫ్ట్ లు ఇచ్చి పుచ్చుకొని ఏకాంతంగా ఒక్క ఆ రోజును గడిపేస్తారు. ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ప్రేమ జంట విషయంలో ప్రియుడు చేసిన దారుణం అంతా ఇంతా కాదు.

అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామానికి చెందిన ఒక మామిడి తోటలో ఇంటర్ విద్యార్థిని దారుణమైన హత్యకు గురైంది. ఆ బాలిక పేరు మౌనిక ఈమె జహీరాబాద్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఇక ప్రేమికుల రోజు సందర్భంగా ప్రియుడు ఏకాంతంగా గడుపుదాం అంటూ చెప్పిన మాయ మాటలు నమ్మి ప్రేమికుల రోజున ప్రియుడితో ఉండాలి అనుకుంది.

ఇద్దరు అనుకున్న విధంగానే మామిడితోటలో కలుసుకున్నారు. అక్కడ ఏమైందో కానీ ప్రియుడు హద్దుమీరి ఆ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఇక ఇంట్లోనే మౌనిక పడుకొని ఉంది అని అనుకుంటున్న తల్లిదండ్రులు క్షుణ్ణంగా గమనించగా ఇంట్లో లేదని తెలిసింది. ఇక మరుసటి రోజు మధ్యాహ్నం ఆ గ్రామం చివర్లో ఉండే మామిడి తోటలో మౌనిక డెడ్ బాడీ కనిపించింది.

ఆమె తల్లి సోదరుడు ఆమె మృతదేహాన్ని గమనించి అది మౌనిక మృతదేహమని తెలుసుకున్నారు. ఇక స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.