వైసీపీ లేడీ ఎమ్మెల్యేని టెన్ష‌న్ పెడుతోన్న సీనియ‌ర్!

శ్రీకాకుళం జిల్లా పాత‌పట్నం నిజ‌యోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి టెన్ష‌న్ ప‌డుతున్నారా? వైకాపాలోకి త‌న‌క‌న్నా సీరియ‌ర్ నేత ఎంట్రీకి రంగం సిద్దం చేయ‌డ‌మే ఆమె టెన్ష‌న్ కు కార‌ణ‌మా? అంటే అవున‌నే తెలుస్తోంది. రెడ్డి శాంతి ఈ నియోజ‌క వ‌ర్గంలో విజ‌యం సాధించేందుకు ఎక్కువ‌గానే శ్ర‌మించారు. ఇక్క‌డ ప‌ట్టు సాధించ‌డం కోసం ఎన్నిక‌ల‌కు ముందుకంటేనే క‌స‌ర‌త్తులు చేసి ప్ర‌జ‌ల్లో మంచి నేత‌గా పేరు సంపాదించారు. టీడీపీ, కాంగ్రాస్ ప్రాబ‌ల్యం ఉన్నం పాత‌ప‌ట్నంలో వైకాపా జెండా రెప‌రెప‌లాడిందంటే కేవ‌లం రెడ్డి శాంతి గొప్ప‌త‌న‌మే అన‌డంలో ఏమాత్రం అతిశ‌యోక్తి లేదు. అదిష్టానం క‌న్నా అక్క‌డి ప్ర‌జ‌లు రెడ్డి శాంతిని బ‌లంగా న‌మ్మే ప్ర‌జ‌లు ఓటేసారని స్థానికులు చెబుతుంటారు.

2009లో ఇక్క‌డ కాంగ్రెస్ గెలిచింది. అంత‌కు ముందు టీడీపీదే హ‌వా. అయితే 2014లో వైకాపా గెలుచుకుంది. వైకాపా నుంచి క‌ల‌మ‌ట వెంక‌ట‌ర‌మ‌ణ‌మూర్తి పోటీ చేసి గెలిచారు. త‌ర్వాత కొన్ని నెల‌లుగా క‌ల‌మ‌ట అధికారంలో ఉన్న టీడీపీలోకి జంప్ అయ్యారు. కనీసం జ‌గ‌న్ కి ఒక్క మాట కూడా చెప్ప‌కుండా స్వ‌తంత్రంగా వ్య‌వ‌రించారు. ఆయ‌న ఎగ్జిట్ తో రెడ్డి శాంత‌కు 2019 ఎన్నిక‌ల్లో అవ‌కాశం దొర‌క‌డం భారీ మెజార్టీతో గెల‌వ‌డం జ‌రిగింది. పార్టీలో ప్ర‌తిప‌క్షం పై విమ‌ర్శ‌నాస్ర్తాలు విస‌ర‌డంలోనూ రెడ్డి శాంతికి మంచి పేరుంది. అయితే ఇప్పుడామె క‌ల‌మ‌ట కార‌ణంగా కాస్త టెన్ష‌న్ ప‌డుతోన్నట్లు వినిపిస్తోంది.

కల‌మ‌ట తిరిగి వైకాపాలో చేరే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. క‌ల‌మ‌ట రీ ఎంట్రీపై స్థానిక వైసీపీ నేత కీల‌క పాత్ర పోషిస్తున్నాడ‌ని స్థానిక‌ల్లో చ‌ర్చ‌కు దారి తీసింది. అయితే ఇక్క‌డే రెడ్డి శాంతి కి టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ని భోగ‌ట్టా. స్థానిక నేత జ‌గ‌న్ కు స‌న్నిహితంగా ఉంటారని, కల‌మ‌టిని గ‌నుక ఆహ్వానిస్తే ఆయ‌న‌కు ఇచ్చే ప్రాముఖ్య‌త ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని…ఆ ర‌కంగా రెడ్డి శాంతి ప్రాముఖ్య‌త త‌గ్గే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. అయితే ఇక్క‌డో విషయం కూడా చ‌ర్చించాలి. క‌ల‌మట వైకాపా నుంచి గెలిచి టీడీపీకి వెళ్లారు కాబ‌ట్టి జ‌గ‌న్ అంత ఈజీగా పార్టీలోకి రానిచ్చే అవ‌కాశం ఉండ‌దంటున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో అంత అవ‌స‌రం కూడా జ‌గ‌న్ కు లేదు. జ‌గ‌న్ ని న‌మ్ముకుని గెలిచిన అభ్య‌ర్ధిని, ఆ నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల సంక్షేమాల గురించి ప‌ట్టించుకోవాలి త‌ప్ప ఇలాంటి అన‌వ‌స‌ర విష‌యాల‌పై ఫోక‌స్ పెట్ట‌ర‌ని కొంత‌మంది వాదన‌.