YS Jagan: మరో పథకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్!

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రజల పట్ల తనకున్న బాధ్యతలను గౌరవించి వారికి అన్ని రకాల సదుపాయాలను కలిగిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మరో పథకాన్ని ప్రారంభించాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం తల్లీబిడ్డలు సురక్షితంగా తమ ఇంటికి చేర్చే విధంగా ‘వైయస్సార్ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్’ ను ప్రారంభించాడు.

తాజాగా విజయవాడ బెంజ్ సర్కిల్ నుండి 500 వాహనాలకు జెండా ఊపి ప్రారంభించాడు. అంతేకాకుండా కొన్ని విషయాలు పంచుకున్నాడు. అక్క చెల్లెమ్మల కోసం ఈ ఏర్పాట్లు చేశామని అన్నాడు. అంతేకాకుండా హాస్పిటల్లో నాణ్యమైన సేవలు అందించే చర్యలు కూడా తీసుకున్నామని తెలిపాడు. గతంలో హాస్పిటల్ లో ఇబ్బందులు ఉండేవి అని ఇప్పుడు అలాంటివి ఉండవని తెలిపాడు వైయస్ జగన్.