డబ్బులు దోచుకోవడం కోసం వైయస్ జగన్ ఇదంతా చేస్తున్నారు: సోమిరెడ్డి

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పలు పార్టీల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య పలు వివాదాలు బాగా చోటు చేసుకుంటున్నాయి. పైగా ఆంధ్రప్రదేశ్ లో కల్తీ సారా, లిక్కర్ లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించాడు. వైయస్ జగన్ ఊరు పేరు లేని కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారని.. జనాలు చనిపోతున్నా పట్టించుకోవడంలేదని.. నాసిరకం మద్యాన్ని అమ్మడం వల్ల ప్రతి ఏటా ఐదు వేల కోట్లను దండుకుంటున్నారని అన్నాడు. డబ్బులు దోచుకోవడం కోసం జగన్ ఈ విధంగా చేస్తున్నాడని ఆరోపించాడు.