Y.S.Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేదని జగన్ విమర్శలు కురిపించారు. ఇటీవల కాసినాయన ఆశ్రమాన్ని కూల్చివేసిన ఘటనపై పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి ఈ క్రమంలోనే ఎంతోమంది వైసిపి నేతలు కూడా ఈ ఘటనపై స్పందించారు.
తాజాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఈ ఘటన గురించి మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే.. దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా అంటూ ప్రశ్నించారు.
అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా? అదే నెల ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్గారికి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖరాసి కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్యకూడా తీసుకోలేదు. ఆలయాలపట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణపట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది.
ఇలా తమ ప్రభుత్వ హయామములు ఆలయ పరిరక్షణలు చేపట్టాము కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున హిందూ ఆలయాల పై దాడులు జరగడం చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్న అటవీశాఖ అధికారులు కాసినాయన ఆశ్రమంపై బుల్డోజర్లు ఎక్కించి కూల్చేశారు. ఇప్పటివరకు కూడా ఆయన ఈ ఘటనపై స్పందించలేదు.ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అని ట్వీట్ చేశారు