Crime News: మద్యం మత్తులో 69 ఏళ్ల వృద్ధురాలి పై యువకుడి దారుణం…!

Crime News: దేశంలో ప్రతి రోజూ మహిళల మీద అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేసినా కూడా కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన దారుణ ఘట తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే…కరీంనగర్ జిల్లా లో బట్టల వ్యాపారం చేసే అయిలేష్ అనే యువకుడు ఇటీవల కోహెడ గ్రామంలో బంధుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ వివాహ వేడుక లో పీకలదాకా మద్యం తాగిన అయిలేష్ మద్యం మత్తులో విచక్షణరహితంగా ప్రవర్తించి పక్కన ఉన్న 69 ఏళ్ల వృద్ధురాలిపై దారుణం గా అత్యాచారానికి పాల్పడ్డాడు.

యువకుడు దాడి చేస్తున్న సమయంలో ప్రతిఘటించడానికి కూడా ఆ వృద్ధురాలు దగ్గర బలం లేకపోవడం తో యువకుడు మరింత రెచ్చి పోయాడు. ఈ క్రమంలో వృద్ధురాలు భయపడి గట్టిగా కేకలు వేయడం తో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వృద్ధురాలి పై అత్యాచారం చేస్తున్న యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. వివాహ వేడుకలో పాల్గొన్న కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ క్రమంలోనే ఈ ఘటనపై పోలీసులు నమోదు చేసుకొని నిందితునీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.