జాబ్ మేళా తేదీని ప్రకటించిన వైసీపీ..

ఆంధ్ర ప్రదేశ్ వైయస్సార్ సీపీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సంగతి గతంలో తెలుపగా మొత్తానికి ఆ తేదీని తాజాగా ప్రకటించింది. తాజాగా జాబ్ మేళా కు సంబంధించిన పోస్టర్ ను, వివరాలు విడుదల కూడా చేశారు.

ఈ నెల 25న వైఎస్ఆర్ కడప జిల్లా చాపాడు మండలం లో సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజీలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తామని తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఇక జాబ్ మేళా కు సంబంధించిన పోస్టర్ లను, వెబ్ సైట్ లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి లతో పాటు పలువురు నాయకులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.