జగన్ వల్ల రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి: అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా జగన్ పాలనపై విమర్శలు గుప్పించాడు. వైకాపా నాయకులు తెలుగుదేశం రాష్ట్రాన్ని క్రైమ్ క్యాపిటల్ గా మార్చారని అన్నాడు. కాకినాడలో సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కూడా పోలీసులు అరెస్ట్ చేయకుండా వారిని కాపాడుతున్నారు అంటూ ఫైర్ అయ్యాడు.

జగన్ విహారయాత్రకు వెళుతూ వైకాపా మూకలను ప్రజల మీదకి వదిలి వెళ్లాడని.. ఆయన వల్లే రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని అన్నాడు. ఆ ఘటన జరిగి 24 గంటలు గడిచినా కూడా ఆ బాధిత కుటుంబాన్ని వైకాపా నేతలు ఎందుకు పరామర్శించ లేదు అని గట్టిగా ప్రశ్నించాడు. ఉదయ భాస్కర్ ను అరెస్టు చేసి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడుతూనే ఉంటామని అన్నాడు.