Wife- Husband: మహా ఇల్లాలు.. భర్త ముఖంపై మరిగే నూనె పోసిన భార్య.. పరిస్థితి దారుణం!

Wife- Husband: సాధారణంగా భార్యాభర్తలు అన్న తర్వాత వారి మధ్య ఎన్నో గొడవలు కొట్లాటలు కలహాలు ఉంటాయి. ఇలా ఎన్నో గొడవలు జరిగిన ఆ గొడవలను అంతటితో మర్చిపోతే వారి సంసారం ఎంతో చక్కగా ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకుని చిన్న గొడవలు కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే….

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం వీఆర్‌ పేటలో నివాసం ఉంటున్న సత్యవతి గంగు నాయుడు దంపతుల మధ్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే వీరిద్దరి మధ్య ఒక చిన్నపాటి గొడవ జరగడంతో అది తీవ్ర పరిణామాలకు దారి తీసింది. ఇలా వీరిద్దరి మధ్య ఈ గొడవ పెద్దది కావడంతో ఆవేశంతో భార్య సత్యవతి తన భర్త ముఖం పై భాగ మరుగుతున్న నూనెను పోసింది. దీంతో గంగు నాయుడు పరిస్థితి తీవ్రతరం అయ్యింది.

వేడి నూనె మొహం పై పడటంతో ఎంతో అర్థ నాదాలు చేసిన గంగు నాయుడుని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోని ఆయన పరిస్థితి ఎంతో విషమంగా ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తన భార్య సత్యవతి పై కేసు నమోదు చేసుకుని అతనిని అదుపులోకి తీసుకున్నారు.ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని మొహం మొత్తం బాగా కాలి పోయినట్లు కళ్ళు కూడా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు.