లైగర్  ఓటిటి లో ఎప్పుడొస్తుందంటే…

సినిమాలంటే ఒకప్పుడు జనాలు థియేటర్స్ కి వెళ్లి చూసేవారు. కానీ కరోనా టైం లో  సినిమా హాళ్లు మూత పడ్డాయి. అప్పుడు జనాలు ఓటిటి లకు బాగా అలవాటుపడ్డారు. భాష తో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూడడం మొదలుపెట్టారు.

కరోనా తగ్గి, థియేటర్ లు ఓపెన్ అయినా కానీ జనాలు థియేటర్ కి వెళ్లాలంటే ఆలోచిస్తున్నారు. పెరిగిన సినిమా టికెట్ ధరలు ఒక వంతు, మెచ్చే సినిమాలు రాకపోవడం వల్ల జనాలు థియేటర్లకు రావడం తగ్గించేశారు. కొన్ని వారాలు ఆగితే ఎలాగో ఏదో ఒక ఓటిటి లో సినిమా వస్తుందిలే అని వెయిట్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం “లైగర్” ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను ప్రముఖ దిగ్గజ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వారు కొనుగోలు చేసినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీనితో అయితే ఈ సినిమా కూడా దాదాపు 50 రోజులు తర్వాతే ఓటిటి లో అందుబాటులోకి రావొచ్చు.