క్రేజీ అప్‌డేట్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో భ‌ళ్లాలుడు అడుగుపెడుతున్నాడు!

ఒక‌వైపు రాజ‌కీయాలు మ‌రో వైపు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ప్ర‌స్తుతం ప‌వ‌న్ వ‌కీల్ సాబ్ చిత్రంతో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, సాగర్‌ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఈ సినిమాల షూటింగ్స్ అన్నీ వ‌చ్చే ఏడాది పూర్తి చేసేలా ప‌వ‌న్ ప్లాన్ చేసుకుంటున్నాడ‌ట‌. అయితే వ‌కీల్ సాబ్ చిత్రాన్ని స‌మ్మ‌ర్ వ‌ర‌కు రిలీజ్ చేయాల‌నే ప్లాన్ లో ఉన్నారు.

మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ రీమేక్‌లో పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సితారా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో రూపొందుతుండ‌గా, సాగ‌ర్ కే చంద్ర తెర‌కెక్కించ‌నున్నారు. మలయాళంలో బిజు మీనన్ నటించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర‌ని తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేయ‌నుంగా, పృథ్వీరాజ్ పాత్ర‌కు ఎవ‌రు చేస్తార‌ని టాక్ న‌డిచింది. రానా, నితిన్, సాయి ధ‌ర‌మ్ తేజ్ వంటి స్టార్స్ పేర్లు చ‌క్క‌ర్లు కొట్ట‌గా చివ‌రిగా చిత్ర నిర్మాణ సంస్థ రానాకే త‌మ ఓటు వేసింది

బాహుబ‌లి సినిమాలో భ‌ళ్ళాల‌దేవ‌గా త‌న స‌త్తా నిరూపించుకున్న ద‌గ్గుబాటి రానా ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఆయ‌న చేతిలో ప్ర‌స్తుతం విరాట ప‌ర్వం, అర‌ణ్య‌,1986తో పాటు ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తాజాగా అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ రీమేక్ లోను రానా న‌టిస్తున్న‌ట్టు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. తొలిసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-రానా క‌లిసి న‌టించ‌నుండగా, ఈ మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్‌పై అంచ‌నాలు అంత‌కంత‌కు పెరుగుతూ పోతున్నాయి. థ‌మ‌న్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు