గ్రేటర్ మేము లేట్ అంటున్న తెరాస.. కేటీఆర్ వ్యూహం ఫలించేనా..?

ministar ktr

 గ్రేటర్ ఎన్నికల హడావిడి మొదలైంది. స్థానిక ఎన్నికలంటే గల్లీ గల్లీలో రాజకీయ వేడి రాజుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కడ చూసిన ఈ ఎన్నికల గురించే చర్చ నడుస్తుంది. ఇక రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడుతుంది. సరైన అభ్యర్థి ఎవరు..? అతనికి ఉన్న విజయావకాశాలు ఏమిటి..? అతని మీద ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా..? ఎన్నికల్లో ఎంతవరకు డబ్బు పెట్టగలడు అనే అంశాలను పార్టీలన్నీ పరిశీలిస్తున్నాయి.

ministar ktr

 ముఖ్యంగా అధికార తెరాస పార్టీ చాలా రోజుల నుంచి కసరత్తులు మొదలు పెట్టంది. కానీ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేయడం లేదు. ఎందుకంటే ఎవరు నీతిమంతులో, ఎవరు గెలుస్తారో టీఆర్ఎస్ తెలియడం లేదట.సర్వే రిపోర్టుల ఆధారంగానే పది నుంచి ఇరవై సీట్లలో మార్పులు ఉంటాయని కేటీఆర్ చెప్పారట. ఇందుకు తగ్గట్లే పక్కా ప్లాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో అనుకున్న ప్లాన్ లో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

 అలాగే అభ్యర్థుల జాబితాను విడుదల చేయకపోవటానికి రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. కేటీఆర్ మార్చాలనుకున్న అభ్యర్థుల మీద అవినీతి ఆరోపణలు రావటం ఒక కారణం అయితే.. రెబెల్స్ ముప్పు లేకుండా చేసుకోవటం మరో కారణమని తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ నిన్న విడులైంది. నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలై.. శుక్రవారం సాయంత్రం నాటికి ముగుస్తోంది. అంటే.. కేవలం మూడు రోజుల మాత్రమే. ఇంత తక్కువ సమయం ఉన్నప్పుడు అభ్యర్థుల జాబితాను ప్రకటించాలి.

 అలా చేస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో.. ఈ రోజు యాభై నుంచి అరవై మంది వరకు.. గురువారం మరికొందరిని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇలా చేయటం వలన టిక్కెట్ రాని నేతలు రెబల్స్ గా మారటానికి సమయం ఉండదు, అదే విధంగా పక్క పార్టీలోకి వెళ్ళటానికి కూడా కుదరకపోవచ్చు, అందుకే సమస్యాత్మకంగా అనిపించిన డివిజన్స్ విషయంలో అభ్యర్థుల ప్రకటన ఆలస్యంగా రావచ్చని తెలుస్తుంది. ఇందంతా ఒక వ్యూహం ప్రకారం కేటీఆర్ కనుసన్నల్లో నడుస్తున్నట్లు తెలుస్తుంది.