విశాఖ గ్యాస్ దుర్ఘటన అధికార పక్షం-ప్రతిపక్షం మధ్య పొలిటికల్ హీట్ ని పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైకాపా-టీడీపీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. సవాళ్లు..ప్రతిసవాళ్లుతో వార్ రోజు రోజుకి ముదురుతోంది. ఎల్ జీ పాలిమర్స్ కి టీడీపీ హాయంలోనే విస్తరణ అనుమతులిచ్చారని అధికార పక్షం ఆరోపిస్తుంటే? చర్చకు సిద్దమా? అంటూ చంద్రబాబు నాయుడు ప్రతి దాడిగి దిగారు. కొన్ని ఆధారాలను సైతం లీక్ చేసి ఇదీ మీరు చేసిన ఘనకార్యం అంటూ నిప్పులు చెరిగారు. గ్యాస్ దుర్ఘటన ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. చర్చలకు సిద్దమా? అంటూ చంద్రబాబు సవాల్ విసరడంతో? వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అంతే ధీటుగా స్పందించారు.
హైదరాబాద్ కి రమ్మంటారా? అమరావతికి రమ్మంటారా? ప్లేస్ ఏదైనా..టైమ్ ఏదానా? ఛాయిస్ ఈజ్ యువర్స్. ఎక్కడైనా చర్చలకు సిద్దం అంటూ ప్రతిసవాల్ విసిరారు. చంద్రబాబుకు అంత దమ్ముంటే నేను రెడీ ఢీ కొడదామా? అంటూ ట్విటర్ వేదికగా గట్టిగానే బధులిచ్చారు. అక్కడితో ఆగని విజయసాయి కరెంట్ బిల్లులు, గ్యాస్ లీక్ బాధితుల పరిహారంపైనా? చంద్రబాబుని టార్గెట్ చేసి దాడికి దిగారు. అనేక సార్లు కరెంట్ చార్జీలు పెంచిన చంద్రబాబు ఇప్పుడు ధర్నాలు చేస్తామంటే? దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేసారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసగా బీషర్ బాగ్ లో ఆందోళన చేస్తున్న నిరసన కారులపై కాల్పుల జరిపి ముగ్గురు అమాయకులను పొట్టనబెట్టుకు చరిత్ర నీది.
ఆఘటన జరిగి 20 ఏళ్లు అయినా ఎవరూ మర్చిపోలేదు అంటూ ధ్వజమెత్తారు. బాబు 20 లక్షలు ఎక్స్ గ్రేషియా డిమాండ్ చేస్తే..మీరంతా నోర్ముసుకునే లా సీఎంగారు కోటి ఇచ్చారు. ప్రత్యర్ధులకు ఆలోచన మెదిలే లోపే జగన్ వాటిని అమలు పరిచి చూపిస్తారు. అది మీ ప్రభుత్వానికి..మా ప్ర్రభుత్వానికి ఉన్న తేడా? మీకు మొదడు బుర్రలో ఉందా? మోకాలులో ఉందో? అని నాకో చిన్న డౌట్ అంటూ విజయ సాయి నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియా అంతటా దావానాలా మండిపోతున్నాయి.
