ఇంకెంత కాలం అవుట్‌డేటెడ్ బుర్ర వాడుతావు మాలోకం.. లోకేష్‌ను ఉతికి పారేసిన విజ‌య‌సాయిరెడ్డి.. !!

 

ఏపీలో పచ్చ చొక్కాల పరువు తీయాలంటే విజ‌య‌సాయిరెడ్డిని మించిన ఢంకా లేదన్న విషయం తెలిసిందే.. ఎందుకో తెలియదు గానీ చేతిలో తుపాకి అయిన గురి తప్పవచ్చు.. కానీ విజ‌య‌సాయిరెడ్డి వదిలిన మాటల బుల్లెట్లు మాత్రం గురితప్పవు.. అదీగాక ఈ వైసీపీ ఎంపీ కి చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు చేయ‌డం అంటే చాలా ఇష్టం ఉన్నట్లుగా ఉంది.. అందుకే ఏ చిన్న అవ‌కాశం దొరికినా చాలు ముందు వెనకా ఆలోచించకుండా తండ్రీ త‌న‌యున్ని ఉతికి ఆరేస్తుంటాడు..

ఇక తన మాటల బాణాలకు ఈ మధ్యకాలంలో కొంత విరామం ఇచ్చినట్లుగా కనిపించినా విజ‌య‌సాయిరెడ్డి మరో సారి తన ప్రతాపాన్ని చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై చూపించారు.. తన పదాలకు వేడుకగా మారిన ట్విట‌ర్ లో ఘాటైన సెటైర్లు వదిలారు.. అవేంటో చూస్తే.. వయో భారంతో సంభవించే సహజ మరణాన్ని కూడా తన రియల్‌ఎస్టేట్ అడ్డా అమరావతి లిస్టులో వేసే దుష్ట ప్రచారానికి దిగిన బాబు నుంచి అవినీతి, అసమర్ధత, అసత్యం వారసత్వంగా తీసుకున్న చినబాబు, ఇప్పుడు తండ్రినే మించిపోయాడు. అంతే కాదు ఆయన మతి చెడినట్లుగా మాలోకం మతి కూడా చెడిపోయింది. ఓ మాలోకం ఇంకెంత కాలం ఈ అవుట్ ‌డేటెడ్ బుర్ర వాడుతావు.. అంటూ విజ‌య‌సాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు. మాలోకం అంటూ వ్యంగంగా లోకేశ్‌ను అవ‌హేళ‌న చేయ‌డం విజ‌య‌సాయిరెడ్డికే చెల్లిందంటున్నారు వైసీపీ వర్గీయులు..

ప్రగల్బాల విత్తనాలు అవలీలగా చల్లే చంద్రబాబు కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వ పనితీరుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించడం చూసి ధైర్యంగా ఆంధ్రాకు వచ్చినట్టున్నాడు.. ఇన్నాళ్లూ టీడీపీ నాయకులకు జూమ్‌లో సందేశాలు ఇవ్వడానికి హైదరాబాద్‌కు వెళ్లినట్లుగా ఉన్నాడు.. ఆయన చేసే ఆ గొప్ప పనికి పొరుగు రాష్ట్రంలో ఉన్నా, కరకట్ట నివాసంలో ఉన్నా ఒకటే అంటూ చంద్రబాబుపై త‌న‌దైన స్టైల్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు విజ‌య‌సాయిరెడ్డి.. మొత్తానికి తండ్రి కొడుకులను తన ట్విట్టర్ వేధికగా ఈ విధంగా ఆడుకున్నాడన్న మాట.. ఏది ఏమైనా ఇలాంటి విషయంలో విజ‌య‌సాయిరెడ్డికి ఏపీలో సాటి ఎవరని ముచ్చటించుకుంటున్నారట అధికార పార్టీ నాయకులు..