కెలికి తిట్టించుకోవడం చంద్ర‌బాబుకి అల‌వాటే

మాన్సాస్ ట్ర‌స్ట్ పై జ‌రిగిన అవినీతిలో భాగంగా మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పై ఆ సంస్థ చైర్ ప‌ర్స‌న్ సంచ‌యిత‌ సంచ‌ల‌న ఆరోప‌ణలు చేసిన సంగ‌తి తెలిసిందే. బాబాయి అశోక్ గ‌జ‌ప‌తిరాజు స‌హాయంతో మాన్సాస్ ట్ర‌స్టును ఇరువురు దోచుకున్నార‌ని సంచ‌యిత‌ చేసిన వ్యాఖ్య‌లు తెలుగు రాష్ర్టాల్లో మ‌రోసారి సంచ‌ల‌నంగా మారాయి. దీంతో టీడీపీ-వైకాపా నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. తాజాగా చంద్ర‌బాబు నాయుడిపై వైకాపా ఎంపీ, రాజ్య‌స‌భ సభ్యుడు విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న కామెంట్లు చేసారు. ట్విట‌ర్ సాక్షిగా విజ‌య‌సాయి చంద్ర‌బాబుపై మ‌రోసారి నిప్పులు చెరిగారు.

`కెలికి మ‌రీ తిట్టించుకోవ‌డం చంద్ర‌బాబుకు అల‌వాటే. అధికారంలో ఉన్న‌వాళ్లు అశోక్ గ‌జ‌ప‌తిని ముందు పెట్టి మాన్సాస్ ట్ర‌స్ట్ ను స‌ర్వ నాశనం చేసాడు. ఏ సంబంధం లేని కుటుంబరావు, ఎన్టీ ఆర్ హెల్త్ వ‌ర్సిటీ ఐవి రావులను స‌భ్యులుగా నియ‌మించినప్పుడే అర్ధ‌మైంది. దాన్ని కేకు ముక్క‌లా నాకేస్తాడ‌ని` చంద్ర‌బాబుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పుడా వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. అస‌లే చంద్ర‌బాబు పేరు ఎత్తితేనే విజ‌య‌సాయి ఒంటికాలుపై లేచిప‌డ‌తారు. ఇప్పుడేకంగా పెద్ద కుంభ‌కోణం జ‌రిగిన అంశంపైనే చంద్ర‌బాబు హైలైట్ అవ్వ‌డంతో ఈ వివాదం విజ‌యసాయికి స‌రైన ఆయుధంలా దొరికింది.

మ‌రీ ఈయ‌న వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబు రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్ప‌టివ‌ర‌కూ విజ‌య్ సాయి చేసిన ప్ర‌తి కామెంట్ పై ఆయ‌న బ‌ధులిచ్చారు. మ‌రి దీనిపై చంద్ర‌బాబు ప్ర‌తిస్పందిస్తారా? సైలెంట్ గా ఉంటారా? అన్న‌ది చూడాలి. ఇప్ప‌టికే అధికార ప‌క్షంపై చంద్ర‌బాబు నాయుడు ప‌లు అంశాలు, ఏడాది పాల‌న‌పై మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. అందులోనూ విజ‌య‌సాయికు స‌వాల్ విస‌ర‌డం కూడా జ‌రిగింది.