బ్రేకింగ్ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్

Union Minister Smriti Irani tests positive for coronavirus

మాయదారి కరోనా ఇంకా జనాలను వదలడం లేదు. ఇంకా బయటికి వెళ్లాలంటే జనాలు భయపడుతున్నారు. ఇప్పటికే చాలామంది కేంద్ర మంత్రులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కూడా కరోనా సోకింది.

Union Minister Smriti Irani tests positive for coronavirus
Union Minister Smriti Irani tests positive for coronavirus

బుధవారం రోజున స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్మృతి.. తనను ఇప్పటి వరకు కలిసిన వాళ్లు వెంటనే పరీక్షలు చేయించుకోవాలంటూ కోరారు.

ట్విట్టర్ లో తనకు కరోనా పాజిటివ్ గా తేలినట్టు ఇరానీ వెల్లడించారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ లాంటి వాళ్లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వాళ్లు కోలుకున్నారు.