డ్యూయ‌ల్ పాత్ర‌లో ర‌వితేజ‌.. ఇద్ద‌రు భామ‌ల‌తో రొమాన్స్‌కు రెడీ

మాస్ మ‌హరాజా ర‌వితేజ రాజా ది గ్రేట్ అనే చిత్రం త‌ర్వాత మ‌ళ్ళీ క్రాక్ అనే సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా అందించిన విజ‌యం ర‌వితేజ‌కు మాములు బూస్ట‌ప్ ఇవ్వ‌లేదు.ఆ ఉత్సాహంతోనే ఖిలాడి సినిమా చేస్తూ అలానే త‌న కెరీర్‌లో 68వ సినిమా చేసేందుకు కూడా సిద్ధ‌మ‌య్యాడు. కొద్ది రోజుల క్రితం ర‌వితేజ 68వ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రాగా, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టిజి విశ్వ ప్రసాద్ అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నేను లోకల్, సినిమా చూపిస్తా మావ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథ రావు ర‌వితేజ 68వ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ర‌వితేజ ఖిలాడి సినిమాతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా పూర్తైన త‌ర్వాత త‌న 68వ సినిమాను మొద‌లు పెట్ట‌నున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. చిత్రంలో ర‌వితేజ తండ్రిగా, కొడుకుగా క‌నిపించ‌నుండ‌గా, ఆయ‌న స‌ర‌స‌న ఐశ్వ‌ర్య మీన‌న్, శ్రీలీలాను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.

ఐశ్వర్య మీనన్ గ‌తంలో లవ్ ఫెయిల్యూర్ అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించగా.. శ్రీలీలా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రూపొందుతున్న పెళ్ళి సందడి సినిమా సీక్వెల్ ‘ పెళ్లి సందD ‘ లో నటిస్తుంది. చూస్తుంటే కొత్త భామ‌లు ఇద్ద‌ర‌కి ర‌వితేజ త‌న 68వ సినిమాతో లైఫ్ ఇవ్వ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.