Pawan Kalyan: ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్.. నిహారిక తాజా ఇష్యూనే కారణమా..?

Pawan Kalyan: ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. మొన్నటివరకూ సెలబ్రెటీల డ్రగ్ కేసు కలకలం రేపితే, ప్రస్తుతం రాష్ట్రంలో సరఫరా అవుతున్న డ్రగ్స్ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవలి కాలంలో పబ్‌ల పేరిట కూడా డ్రగ్స్‌ను సప్లై చేస్తూ పోలీసులకు చిక్కడం విస్తుగొలుపుతోంది. తాజాగా అలాంటి సంఘటనే రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో అకస్మాత్తుగా పోలీసులు నిర్వహించిన దాడుల్లో పలువురు అరెస్ట్ అయ్యారు. అయితే ఈ అరెస్ట్ అయిన వారిలో ప్రముఖులు, సెలబ్రెటీలకు చెందిన పిల్లలు కూడా ఉండడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. వారిని ముందు అదుపులోకి తీసుకున్నా, ఆ తర్వాత వారిని విచారించి వదిలేశారు. కానీ ఆ ఘటన మాత్రం ఇంకా అందరి నోళ్లలోనూ నానుతూనే ఉంది. ఇక అక్కడ దొరికిన కొన్ని మత్తు పదార్థాలను పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు.

కాగా ఈ కేసులో మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఆ సమయంలో అదే పబ్‌లో ఉండడం సంచలనం సృష్టిస్తోంది. అయితే ఆమెను కూడా విచారణ అనంతరం పోలీసులు వదిలేశారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఎస్సీ,బీసీలు క‌లిసి రాజ్యాధికారాన్ని సాధించేందుకు రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆలోచ‌న‌ల‌ను పంచుకుంటూ ర‌చ‌యిత వాకాడ శ్రీ‌నివాస్ కోట్‌ను పవన్ కల్యాణ్ ప్రస్తావిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. ముఖ్యంగా శ‌త్రువులు కూడా మ‌న‌ల‌ను వాడుకోగలిగేంత మూర్ఖత్వం మ‌న‌ది. అవ‌త‌లివాడు మ‌న‌ల్ని వాడుకోవ‌డ‌మే మ‌న విజ‌య‌మ‌ని భ్రమ ప‌డేంత అమాయ‌క‌త్వం మ‌న‌ద‌ని ఆయన చేసిన పోస్ట్ పలు సందేహాలకు దారి తీస్తోంది. అయితే ఆయన చేసిన ట్వీట్ అనేది ఏ విషయంపై అనేది క్లారిటీగా చెప్పకపోయినా, తాజాగా నిహారిక ఇష్యూ జరగడంతో దాని మీదే ఆయన ఈ విధంగా స్పందించారని పలువురు భావిస్తున్నారు.