భానుడు భగభగలు.. 40 పైగా డిగ్రీల ఎండలు!

భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 నుండి 42 డిగ్రీల ఎండతో ప్రజలు అల్లాడుతున్నారు. ఎండ తీవ్రతకు కారణంగా జనాలు రోడ్ల మీదకు రావడం లేదు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎలా ఉండబోతుందని ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఉష్ణోగ్రతలతోపాటు వడగాల్పులు తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనం అల్లాడుతున్నారు. దీంతో అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.