వ‌ణుకుతున్న ప్రజాప్రతినిధులు.. మరో ఎమ్మెల్యేకి క‌రోనా..!

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. అస‌లు వివ‌రాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దార‌ణ అయ్యింది. దీం‌తో ఆయ‌న హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో ఐసోలేష‌న్‌లో ఉంఊ చికిత్స తీసుకుంటున్నారు. ఇక జీవ‌న్ రెడ్డిని క‌లిసిన వారిని, ఆయ‌న కుటుంబసభ్యులకు కూడా క‌రోనా పరీక్షలు చేస్తున్నారు.

ఇక క‌రోనా ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌డంలేదు. ఒక‌వైపు సామాన్యుల వెన్నులో వ‌ణుకుపుట్టిస్తుంది. మ‌రోవైపు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా కరోనా భారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్‌ల‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. అయితే వీరంతా దాదాపుగా క‌రోనా నుండి కోలుకున్నారు.

తెలంగాణలో ప్ర‌స్తుతం క‌రోనా కేసుల సంఖ్య 58,908కి చేరుకుంది. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్త‌గా 1,764 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, క‌రోనా కార‌ణంగా 12 మంది మృతి చెందారు. మొత్తంగా చూసుకుంటే.. క‌రోనాతో ఇప్ప‌టి వ‌ర‌కు 492 మంది ప్రాణాలు కోల్పోగా, 43,751 మంది క‌రోరా నుండి కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం తెలంగాణ వ్యాప్తంగా 14,663 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.