traffic challans: నేటి నుంచే చలాన్లపై 75% రాయితీ.. చెల్లించండి ఇలా!

వాహనదారులకు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌‌లో ఉన్న చలాన్లపై 75 శాతం మాఫీ చేస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. వాహనదారులు ఈ మాఫీ అవకాశాన్ని నేటి నుంచి నియోగించుకోవచ్చు. ఈ మేరకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఈ చలాన్లకు సంబంధించి వెబ్‌సైట్‌ (https://echallan.tspolice. gov.in)లో ప్రత్యేక లింక్‌ను మంగళవారం నుంచి అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రస్తుతం పెండింగ్‌ చలాన్ల రుసుం రూ. 1800 కోట్ల వరకు ఉంటుందని పోలీసుల అంచనా..

తగ్గింపు ఇలా

నో మాస్కు కేసులకు – 90% వరకు మాఫీ
రెండు, మూడు వీలర్ వాహనాలకు – 75%
ఆర్టీసీ బస్సులకు – 70%
లైట్‌, హెవీ మోటారు వాహనాలకు – 50%
తోపుడు బండ్లకు – 75%