ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను చంపి.. అనంతరం పోలీసుల లొంగిపోయిన యువతి?

రోజురోజుకీ సమాజంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాల వల్ల కాపురాలు నాశనం అవుతాయి అని తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగింది. భోపాల్‌లోని కటరా హిల్స్‌కు చెందిన ధనరాజ్ అనే వ్యక్తి సంగీత అనే మహిళను కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు.వీరు 2014 నుంచి సాగర్ గోల్డెన్ పార్క్‌లోని కటరా హిల్స్‌లో ఉంటున్నారు. ధనరాజ్ పైపుల వ్యాపారం చేస్తుండేవాడు. అతనికి ఒక షాపు ఉంది. భార్య సంగీత గృహిణిగా ఇంట్లోనే ఉండేది. వీళ్ల ఇంటి ఎదురే ఆశిష్ పాండే అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నివాసం ఉండేవాడు. అతనికి కూడ పెళ్లై పిల్లలున్నారు. ఇరుగుపొరుగు వారు కావడంతో రెండు కుటుంబాల మధ్య స్నేహం ఏర్పడింది.

ఈ క్రమంలోనే ధనరాజ్ భార్యపై ఆశిష్ కన్నేశాడు. ఏదో ఒక వంకతో అప్పటి నుంచి ధనరాజ్ ఇంటికి వస్తూపోతూ ఉండేవాడు.ధనరాజ్ భార్య కూడా ఆశిష్‌ దారిలోనే నడవడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. పలుమార్లు ధనరాజ్ ఇంట్లో లేని సమయంలో అతని ఇంట్లోనే ఆశిష్, సంగీత రాసలీలలు సాగించేవారు. నెల క్రితం.. ధనరాజ్ ఇంటికొచ్చిన సమయంలో ఇద్దరూ ఇంట్లో కామకేళి సాగిస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ధన్‌రాజ్ ఆశిష్‌తో మాట్లాడటం మానేశాడు. భార్యను హెచ్చరించినప్పటికీ ధన్‌రాజ్‌కు మనశ్శాంతి లేకుండా పోయింది. తాను బయటకు వెళ్లగానే మళ్లీ ఇద్దరూ ఎక్కడ కలుసుకుంటారోనన్న అనుమానం మొదలైంది. ఏం చేయాలా అని అతను ఆలోచిస్తున్నాడు.

ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధాన్ని తెంచేయవచ్చని భావించాడు.ఈ క్రమంలో వేరే ప్రదేశంలో ఇల్లు చూశాడు.సామాన్లు ప్యాక్ చేయాలని, ఇల్లు ఖాళీ చేస్తున్నామని ధనరాజ్ చెప్పాడు. వెళ్లిపోతే తన ప్రియుడు ఆశిష్‌ను కలవడం మళ్లీ సాధ్యమవదని భావించిన సంగీత తన భర్తను చంపాలని నిర్ణయించుకుంది.ప్రియుడికి విషయం చెప్పింది. ప్రియుడితో కలిసి భర్త హత్యకు సంగీత ప్లాన్ చేసింది.