టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న ప్రముఖ సెలబ్రిటీలు వీళ్లే?

సాధారణ ప్రజలతో పోల్చి చూస్తే సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసుకోవదం విడాకులు తీసుకోవడం సాధారణంగా జరుగుతుందనే సంగతి తెలిసిందే. విడాకులు తీసుకున్న సెలబ్రిటీలలో కొంతమంది సెలబ్రిటీలు వెంటనే మరో పెళ్లి చేసుకుని అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న సినీ ప్రముఖులు చాలామందే ఉన్నారు.

అక్కినేని నాగార్జున మొదట దగ్గుబాటి లక్ష్మిని వివాహం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. కొన్ని విషయాలలో లక్ష్మితో బేధాభిప్రాయాలు రావడంతో నాగార్జున ఆమెకు విడాకులు ఇచ్చి అమలను పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ మొదట వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కమల్ హాసన్ సారికను పెళ్లి చేసుకోవడం జరిగింది. కమల్ సారిక దంపతులకు ఇద్దరు కూతుళ్లు కాగా వాళ్లలో ఒకరు శృతి హాసన్ మరొకరు అక్షర హాసన్ అనే సంగతి తెలిసిందే.

ప్రకాష్ రాజ్ మొదట లలిత కుమారిని మ్యారేజ్ చేసుకోగా వేర్వేరు కారణాల వల్ల వీళ్లిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ పోనీ వర్మను వివాహం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. పవన్ మొదట నందినిని పెళ్లి చేసుకుని విడిపోగా ఆ తర్వాత పవన్ రేణు దేశాయ్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రేణు దేశాయ్ కు కూడా విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవాను పెళ్లి చేసుకున్నారు.

కృష్ణంరాజు మొదట సీతాదేవిని వివాహం చేసుకోగా ఆమె మృతి చెందడంతో కృష్ణంరాజు శ్యామలా దేవిని వివాహం చేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ మొదట మేనమామ కూతురు బసవతారకంను పెళ్లి చేసుకున్నారు. 1993 సంవత్సరంలో సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీలు ఎక్కువ సంఖ్యలోనే ఉండటం గమనార్హం.