సీనియర్ తెలుగు నటుడు కోవిద్ తో మృతి !

Kosuri Venugopal

సీనియర్ తెలుగు నటులు కోసూరి వేణుగోపాల్ గారు ఈ రోజు కోవిద్-19 వల్ల మృతి చెందారు. తెలుగు సినీ ప్రేక్షకులకు కోసూరి వేణుగోపాల్ క్యారెక్టర్ నటుడిగా, కమెడియన్ గా సుపరిచితులు. గచ్చిబౌలి లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గత ఇరవై ఎండు రోజులుగా కోవిద్ కి చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

Kosuri Venugopal

పశ్చిమ గోదావరిలోని నర్సాపూర్‌కు చెందిన వేణుగోపాల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. అతను డ్రామాలా పట్ల మక్కువ కారణంగా తన ఉద్యోగంతో పాటు నాటకాలు వేసేవారు. మర్యాద రామన్న, చలో, పిల్లా జమీందార్, అమీ తుమి లాంటి మరెన్నో చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. చిత్ర పరిశ్రమతో కోసూరి వేణుగోపాల్ గారిది 26 సంవత్సరాల అనుబంధం.ఆయన మృతికి టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

అయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ అయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది తెలుగురాజ్యం.