పురిటిబిడ్డను దారుణంగా చంపేసిన యువతీ.. అలా చంపడానికి కారణం?

ప్రస్తుత కాలంలో యువత కేవలం తొందరపాటు కారణంగానే పెళ్లి కాకుండానే తల్లి అవుతున్నారు.ఇలా పెళ్లి కాకుండానే తల్లి అవుతూ అబార్షన్ చేయించుకుంటే ప్రాణానికే ప్రమాదమని భావించి ఆ బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం వారిని ఏ చెత్తకుప్పల్లోనో, మురికి కాలువలో పడేసిన ఆ పాపాన్ని తమ నెత్తిన వేసుకుంటున్నారు. ఇలాంటి ఘటన తాజాగా తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో చోటు చేసుకుంది. ఒక వివాహిత తానే స్వయంగా ప్రసవం చేసుకుని ఆ బిడ్డను టాయిలెట్స్ ఇంట్లో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో ఉన్న టాయిలెట్‌లో నీరు రాకపోవడంతో రోగులు ఆస్పత్రి సిబ్బందికి తెలియజేశారు.ఇక ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది టాయిలెట్స్ ఇంట్లో ఒక బాక్స్ కనిపించడంతో దాన్ని తెరిచి చూడగా అందులో ఆడశిశువు విగతజీవిగా పడి ఉండటం చూసి అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని సీసీటీవీ ఫుటేజీలను గమనించారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా ఆలంగుడికి చెందిన ఒక యువతిని అరెస్టు చేసి విచారణ చేపట్టడంతో అసలు విషయాలు బయటపడ్డాయి.

ఆ యువతి ఒక బనియన్ కంపెనీలో పనిచేసే సహ ఉద్యోగితో ప్రేమలోపడి తొందరపాటు కారణంగా పెళ్లి కాకుండానే గర్భవతి అయింది.ఇక అబార్షన్ చేయించుకుంటే తన ప్రాణానికి ప్రమాదం అని భావించిన ఆ యువతి తొమ్మిది నెలల పాటు బిడ్డను కడుపులో మోసి చివరికి కడుపునొప్పి రావడంతో ఈ నెల 3వ తేదీన తంజావూరు ప్రభుత్వాస్పత్రిలో చేరినట్టు తెలిసింది. అక్కడినుంచి ఆమె వైద్య కళాశాల ఆస్పత్రికి వచ్చిందని,ఆస్పత్రి ఆవరణలో ఒక అరగంటపాటు తిరిగి ప్రసవ నొప్పులు భరిస్తున్న నేపథ్యంలో ఆ యువతి స్వయంగా బాత్రూంకి వెళ్లి ప్రసవం చేసుకుని పుట్టిన బిడ్డను ఒక పెట్టెలో పెట్టి టాయిలెట్ సింక్ లోపడేసింది అనంతరం అధిక రక్తస్రావంతో ఆమె బయటకు వెళ్లడం సిసి టివి ఫుటేజ్ లో కనిపించడంతో దీని ఆధారంగా నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.ఇక ఈ వ్యవహారంలో బాధితురాలు తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉంటుందన్న కోణంలో పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.