Accident: ముగ్గురి ప్రాణాలు తీసిన సినిమా మీద అభిమానం.. బెనిఫిట్ షో కి వెళుతుండగా దారుణం..!

Accident: అభిమానులు ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఈ రోజు థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల అయింది. ఈ సినిమా చూడటానికి అభిమానులు నిన్న రాత్రి నుండే థియేటర్ల వద్ద ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా చూడాలన్న ఆశ ముగ్గురు యువకుల ప్రాణం తీసింది. బెనిఫిట్ షో చూడాలని ఎంతో ఆతృతగా బయలుదేరిన అభిమానులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది.

వివరాల్లోకి వెళితే… ఆర్ ఆర్ ఆర్ సినిమా చూడటానికి వెళ్తున్న అభిమానులు తమిళనాడులోని పేర్నమ్ బట్టు నుంచి వి.కోతకు వస్తుండగా.. పాపేపల్లి వద్ద రాత్రి ఒంటి గంట సమయంలో ప్రమాదవశాత్తు రెండు బైక్‌లు అదుపుతప్పి ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈఘటనలో 25 ఏళ్ల దుర్గ అనే యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరు యువకులను చికిత్స నిమిత్తం కుప్పం పీ.ఈ.ఎస్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో గాయపడిన గంగాధర్, వినయ్ కుమార్అనే ఇద్దరు యువకులు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

మృతి చెందిన యువకులు ముగ్గురు వీకోట మండలం బంగ్లా గ్రామం తుపాకీ వాండ్ల పల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.ఉపాధి కోసం తమిళనాడు వెళ్లి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ ఘటనలో రామకుప్పం కి చెందిన మరొక యువకుడు గాయపడగా అతడు కుప్పం పి ఎస్ లో చికిత్స పొందుతున్నాడు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కాగా రోడ్డు ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.