‘సీఎం’కు బెదిరింపు లేఖ .. అప్రమత్తమైన హోంశాఖ

సీఎం నవీన్‌ పట్నాయక్‌కు హత్య బెదిరింపు లేఖ చేరింది. ఆయన నివాస కార్యాలయానికి గురువారం వచ్చిన ఈ లేఖలో హత్యకు వ్యూహరచన పూర్తి అయినట్లు పొందుపరిచారు. కిరాయి హంతకులు సిద్ధం అయ్యారని.. అత్యాధునిక అస్త్రాలతో హత్యల్లో ఆరితేరిన వర్గం నగరంలో నవీన్‌ ప్రతి అడుగులో అడుగు వేస్తుందని అందులోని ప్రధానాంశం. ప్రధాన వ్యూహకర్త నాగ్‌పూర్ ‌లో ఉంటున్నాడని, మారణాస్త్రాలు రాష్ట్రానికి చేరాయని ఇంగ్లీషులో చేతిరాత లేఖ వచ్చింది.

Odisha CM Naveen Patnaik Gets Letter Claiming Threat To His Life - Sakshi

ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ అనుబంధ అధికార వర్గాలకు అలర్ట్‌ జారీ చేసింది. దీంతో నవీన్‌ నివాస్‌లో హల్‌చల్‌ పుంజుకుంది. అయితే లేఖరాసిన వ్యక్తి, వర్గం, స్థలం వగైరా సమాచారం ఏమీ లేకుండా అనామక లేఖ జారీ కావడం ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఈ లేఖాంశాల సత్యాసత్యాల నిర్థారణ జరగాల్సి ఉంది.

ఎం నవీన్‌ నివాస్‌కు చేరిన అనామక లేఖతో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. హత్య బెదిరింపు నేపథ్యంలో భద్రతా వ్యవస్థను తక్షణమే పటిష్టపరిచింది. రాష్ట్ర హోంశాఖ నవీన్‌ నివాస్‌కు చేరిన లేఖను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్ కి పంపింది. ఈ నేపథ్యంలో జంట నగరాల పోలీస్‌ కమిషనర్‌ వర్గాలను హోంశాఖ అప్రమత్తం చేసింది. తక్షణమే ముఖ్యమంత్రి భద్రత, రక్షణ ఏర్పాట్లని సమీక్షించాలని ఆదేశించింది.