జనసేన సైనికులు బెదిరిస్తే ఊరుకునేది లేదు: నాగబాబు కామెంట్

తాజాగా సినీ నటుడు, మెగా సోదరుడు నాగబాబు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో బిజీగా ఉండగా అక్కడ మీడియాతో సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అధికార మదంతో జన సైనికులను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. తమ పదవులను అడ్డం పెట్టుకొని బరి తెగి ప్రవర్తిస్తున్నారని అన్నారు.

అలా ప్రవర్తిస్తే ఆ నేతలకు తగిన రీతిలో గట్టిగా సమాధానం చెబుతామని ఊరుకునేది లేదని అన్నారు. ఉత్తరాంధ్రలో జనసేన కు బలమైన పునాదులు ఉన్నాయని.. వాటిని కదిలించే సత్తా ఎవరికీ లేదని అన్నారు. ఉత్తరాంధ్ర జనసైనికులు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావజాలం తోనే ముందుకు సాగుతున్నారని అన్నారు.