తన ఫస్ట్ సినిమాకే 1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఈ స్టార్ హీరోయిన్..!

జెనరల్ గా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా కూడా హీరోయిన్ లకి కాస్త రెమ్యునరేషన్ లు పరంగా హీరోలతో పోలిస్తే తక్కువే ఉంటుంది. కానీ ఒక్కసారి గాని కొంతమంది క్లిక్ అయితే భారీ రెమ్యునరేషన్ లు ఇస్తారు. కానీ తన ఫస్ట్ సినిమాకే ఏకంగా కోటి రూపాయలు రెమ్యునరేషన్ గా ఓ స్టార్ హీరోయిన్ తీసుకుందట.

అయితే ఈ మేటర్ లోకి వెళితే ఆ హీరోయిన్ బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోయిన్ మానుశి చిల్లర్ అట. ఈమె అక్కడి స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో భారీ పాన్ ఇండియా సినిమా పృథ్వి రాజ్ లో నటించింది. అయితే ఈమె మిస్ వరల్డ్ గా గెలిచి ఫస్ట్ సినిమాగా ఈ చిత్రానికి అవకాశం దక్కించుకుంది అట.

దీనితో ఈమె ఫస్ట్ సినిమాకే నిర్మాతలు కోటి రూపాయలు చెప్పినా నో అనకుండా ఇచ్చారట. ఇది ఒక భారీ మొత్తం అని చెప్పాలి. ఇక ఈ సినిమా గాని హిట్ అయితే ఆమె ఇంకెంత డిమాండ్ చేస్తుందో చూడాలి. ఇంకా ఈ భారీ సినిమా కి చంద్ర ప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించగా శంకర్ మహా దేవన్ – ఈషన్ – లాయ్ లు సంగీతం అందించారు. అలాగే యష్ రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం జూన్ 3న విడుదల కాబోతోంది.