మద్యం నిషేదం చేస్తామని చెప్పి దాని మీద ఆదాయం సంపాదిస్తున్నారు: పవన్

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ మద్యం విధానంపై విమర్శలు చేశారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యంపైనే డబ్బులు సంపాదిస్తామన్నట్లు చేస్తున్నారు అని అన్నారు. రాష్ట్రంలో సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే నని.. చిన్న గమనిక అంటూ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

అంతేకాకుండా వాటి ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయాన్ని కూడా వారికే నని అన్నారు. అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు.. సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు.. అంటూ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.