పవన్ కళ్యాణ్ పేరుతో నన్ను మోసం చేసి డబ్బు తీసుకెళ్లారు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో మనందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉపయోగించుకొని కొందరు తనను మోసం చేసి తన దగ్గర నుంచి 50 వేల రూపాయలు తీసుకెళ్లారని సీనియర్ నిర్మాత బాలాజీ నాగలింగం ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.ఈ సందర్భంగా బాలాజీ నాగలింగం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కెరియర్ మొదట్లో అక్కడ అమ్మాయిలు ఇక్కడ అబ్బాయిలు సినిమా షూటింగ్ చేస్తున్న సమయం .అయితే పవన్ కళ్యాణ్ దగ్గర పూర్ణ హేమచంద్ర అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వీరిద్దరూ సాయంత్రం అయ్యే సరికి నా ఆఫీసుకు వచ్చి నన్ను కలిసేవారు. ఇలా ఒకరోజు హేమచంద్ర పవన్ కళ్యాణ్ గారితో మీరు సినిమా చేస్తారా అని ప్రశ్నించారు. ఆ మాటకు తప్పకుండా చేస్తానని చెప్పినట్లు బాలాజీ నాగలింగం వెల్లడించారు.

ఈ క్రమంలోనే నాకు రాఘవేంద్రరావు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయాలని ఉంది ఈ కాంబినేషన్ ను మెగా బ్రదర్ నాగబాబు దృష్టికి కూడా తీసుకెళ్లాలని హేమచంద్ర చెప్పారు. అలాగే మద్రాసులోని డ్రైవ్ ఇన్ వుడ్లాండ్స్ దగ్గర పవన్ కళ్యాణ్ ని కలిసినపుడు తప్పకుండా సినిమా చేస్తానని చెప్పారు అంటూ హేమచంద్ర నా దగ్గర వెల్లడించారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ నాతో సినిమా చేస్తారని చెప్పడంతో సంతోషపడ్డాను. అయితే ఒక పది రోజుల తర్వాత పూర్ణ నా దగ్గరికి వచ్చి బాస్ షిరిడికి వెళ్తున్నారు రెండు లక్షల రూపాయలు కావాలని అడిగారు. ఆ సమయంలో చిలకకొట్టుడు సినిమా ఫ్లాప్ లో ఉన్న నా దగ్గర అంత డబ్బు లేదని చెప్పి కేవలం 50 వేల రూపాయలు ఇచ్చాను.

అయితే పూర్ణ ఆ డబ్బులు పవన్ కళ్యాణ్ కి ఇచ్చారో లేదో నాకు తెలియదు. అయితే ప్రస్తుతం ఆయన చనిపోయి ఉన్నారు. అతని చనిపోక ముందు రెండు మూడు సార్లు ఈ విషయం గురించి హెచ్చరించిన ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇదే విషయం గురించి ఆయన సోదరుడు హేమచంద్రను అడగగా అప్పుడు మాట్లాడతా ఇప్పుడు మాట్లాడతా అంటూ వాయిదా వేశారు. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగిపోయారు. నేను మాత్రం ఇక్కడే ఉండి పోయాను అంటూ బాలాజీ నాగలింగం గతంలో పవన్ కళ్యాణ్ పేరుతో తనని మోసం చేసినట్టు ఈ సందర్భంగా వెల్లడించారు.