Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీమ్లానాయక్ రిలీజ్ వేడుకకు అతిథులు వీరే!

Pawan Kalyan: మహేష్ బాబు,పవన్ కళ్యాణ్ ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోస్ వాళ్లిదరు కలిసి ఇంత వరకు ఎక్కడ కనిపించలేదు అయితే వీళ్లిద్దరు కలిసి ఒకే స్క్రీన్ మీద కనిపించాలని ఫ్యాన్స్ చాలా ఆశపడ్డ అది జరగలేదు. అయితే ఇప్పుడు ఇద్దరు ఒక వేదిక పైకి రానున్నట్టు సమాచారం.

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం భారీగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్నేహితుడు కావడంతో వస్తారు. ఇక మహేష్ త్రివిక్రమ్ కలిసి నెక్స్ట్ ఫిల్మ్ చేయబోతున్నారు కాబట్టి ఈ వేడుకకు మహేష్ బాబు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇక ప్రతి పెద్ద సినిమా వేడుకలకు రాజమౌళిని పిలవడం ఆనవాయితి అయిపోయింది అలాగే మహేష్ రాజమౌళి క్రేజీ కాంబినేషన్ కూడా సెట్స్ పైకి వెళ్ళనుంది
సో మహేష్ బాబు రాజమౌళి బీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి.

ఇలా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అతిథులుగా వచ్చే వారి గురించి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికి ఫిల్మ్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇక భీమ్లా నాయక్ సినిమా మలయాళం అయ్యప్పనూమ్ కోషియమ్ రీమేక్ అయితే ఈ సినిమాలో చాలా మార్పులు చేసినట్టు నిర్మాత సూర్య దేవరకొండ నాగ వంశీ తెలిపారు.
ఈ సినిమా ను సాగర్ చంద్ర డైరెక్ట్ చేసారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. ఇందులో రానా దగ్గుబాటి కీలక పాత్రలో కన్పించనున్నారు. ఫిబ్రవరి 25 న సినిమా రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 20 లేదా 21 న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం.