ఆమె ఒక్క మాట మాట్లాడితే చాలు అని జగన్ తో పాటు రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తోంది!

ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆరంభంలో పార్టీ కార్య‌క్ర‌మాల్లో ఎంత చురుకుగా పాల్గొనేవారో తెలిసిందే. ప్ర‌భుత్వాన్ని…జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని విమ‌ర్శిస్తే వాటిని తిప్పికొట్టే ప్ర‌య‌త్నం చేసేవారు. సంక్షేమ ప‌థ‌కాల్ని..జ‌గ‌న్ పై జ‌గ‌న‌న్న అంటూ టిక్ టాక్ వీడియోలు చేసి బాగా ఫేమ‌స్ అయ్యారు. ఆ ర‌కంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బాగా చేరువ‌య్యారు. కానీ ఇటీవ‌లి కాలంలో పుష్ప శ్రీవాణి ట‌చ్ లేకుండా పోయారు. మాట‌ల్లేవ్..మాట్లాడుకోవ‌డాలు లేవంటూ! పార్టీకి దూరంగా ఉంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. పుష్ప శ్రీవాణి మామ జ‌గ‌న్ ప‌థ‌కాల‌ను విమ‌ర్శిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

pushpa sri vani
pushpa sri vani

కోడ‌లు జ‌గ‌న్ ని ఆకాశానికి ఎత్తేస్తుంటే..మామ పాతాళానికి తొక్కే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పుష్ప శ్రీవాణి ఎటూ తేల్చుకోలేని ప‌రిస్థిల్లో ఉన్న‌ట్లు కొన్ని రోజుల గా ప్ర‌చారం సాగుతోంది. అందులో వాస్త‌వం ఎంతో తెలియ‌దుగానీ ఇప్ప‌టికీ పుష్ప మౌనం వీడ‌లేదు. దీంతో ఈ మౌనం వెనుక అంత‌రార్ధం ఏంటో ఏపీ ప్ర‌జ‌లు స‌హా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కూడా అంతు చిక్క‌డం లేద‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. రాజ‌కీయాల క‌న్నా..ఫ్యామిలీ బాండింగ్స్ కే లేడీ మంత్రి ఎక్కువ వెయిట్ ఇస్తున్నారా? అన్న కొత్త అనుమానాలు ఇప్పుడు తెర మీద‌కు వ‌స్తున్నాయి. ఆ మ‌ధ్య విజ‌య‌న‌గ‌రంలో జ‌రిగిన ఓ స‌మావేశానికి పుష్ప‌తో పాటు ఆమె భ‌ర్త కూడా హాజ‌ర‌య్యారు.

వేదిక‌పై విజ‌య‌సాయి రెడ్డి, బోత్స స‌త్య‌నారాయ‌ణ‌, పుష్ప శ్రీవాణి అంతా ప‌క్క ప‌క్కనే కూర్చున్నారు. ఇంత‌లో పుష్ప శ్రీవాణి వ‌ల‌వ‌లా ఏడ్చారు. అది గ‌మ‌నించిన విజ‌య‌సాయి ఎందుకు క‌న్నీళ్లు? అని అడిగారు దానికి…పుష్ప శ్రీవాణి బ‌ధులిచ్చారు. ఆ వెంట‌నే పుష్ప భ‌ర్త‌ని వేదిక మీద‌కు ఆహ్వానించ‌గానే ఆమె ముఖం వేయి ఓల్టుల కాంతితో వెలిగింది. కానీ ఇప్పుడా కాంతి మామ కార‌ణంగా త‌గ్గింద‌నే ప్ర‌చారం సాగుతోంది. వైసీపీ పుష్ప శ్రీ వాణికి రాజ‌కీయ భ‌విష్య‌త్ ఇస్తే మామ కార‌ణంగా వెనుక‌బ‌డే ప‌రిస్థితి వ‌స్తోంద‌ని తెలుస్తోంది.