Tollyood Heros: నిర్మాతగా మారిన టాలీవుడ్ స్టార్ హీరోలు… ఎవరంటే?

Tollywood Heros:టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా మంది హీరోలు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను తీసి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు తీసుకునే స్థాయిలో రేషన్ తీసుకుంటున్నారు.టాలీవుడ్ హీరోలు కూడా సుమారు వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ వారి కంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఇదిలా ఉండగా కొందరు హీరోలు ఈ డబ్బును బిజినెస్ వైపు మళ్ళించగా మరి కొందరు ప్రొడక్షన్ వైపు పయనిస్తూ సినిమాలను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి లాభాల బాటలో ఉన్నారు. ఈ క్రమంలోనే మరో ఇద్దరు హీరోలు సైతం కొత్తగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాలని చూస్తున్నారు.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగిన అల్లు అర్జున్ హీరోగా మంచి గుర్తింపు పొందిన ఈయన ఇప్పటికే గీతాఆర్ట్స్ బ్యానర్, గీత ఆర్ట్స్ బ్యానర్ 2 మల్టీ ప్రొడక్షన్ హౌస్ లో ఉన్నప్పటికీ సొంతంగా మరొక ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న గోపీచంద్ సైతం నిర్మాతగా మారనున్నాడు. ఈయన తండ్రికి చాలా సంవత్సరాల క్రితం ప్రొడక్షన్ హౌస్ ఉండేది తిరిగి ఈ నిర్మాణ సంస్థ ద్వారా గోపీచంద్ సినిమాలను తెరకెక్కించాలని భావిస్తున్నారు. అదే విధంగా విజయ్ దేవరకొండ మహేష్ బాబు వంటి వారు సైతం పలు చిత్రాలకు నిర్మాతలుగా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే.