Thaman Gave Interesting Update : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట“. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు సూపర్ పాజిటివ్ టాక్ తో మరిన్ని అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి దగ్గర అవుతుంది.
అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ మాస్ రెస్పాన్స్ తో ఆల్ టైం రికార్డులు సెట్ చేస్తుండగా ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై తాను వర్క్ చేస్తున్నట్టుగా తెలిపాడు.
24/7 సర్కారు వారి పాట సినిమా కోసం తన యూనిట్ తో డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ తాము బిజీగా ఉన్నామని తెలిపాడు. సినిమాలో ఆల్రెడీ మూడు సూపర్ హిట్ సాంగ్స్ అందించాడు అలాగే మరో రెండు త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి. వీటిపై కూడా త్వరలో అధికారిక అప్డేట్స్ రానున్నాయి.
అలాగే ఈ చిత్రం యూఎస్ లో అయితే రికార్డు లొకేషన్స్ లో రిలీజ్ కాబోతుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు మహేష్ బాబు నిర్మాణ సంస్థ సహా 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.
Yayyyyy !! 24/7 !! and We are 🤙🎬⚡️@Dolby @DolbyAtmosNL Mix #SarkaaruVaariPaataBgm @shadabRayeen @dineshkeys pic.twitter.com/8drn6TBs5d
— thaman S (@MusicThaman) May 4, 2022
