Sarkaru Vaari Paata : ట్రైలర్.. వై ఎస్ జగన్ డైలాగ్ తో దుమ్ము లేపిన మహేష్ !

Sarkaru Vaari Paata Official Trailer

Sarkaru Vaari Paata Official Trailer :  మన తెలుగు సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” నుంచి ఎట్టకేలకు చాలా రోజులు నుంచి పడుతున్న నిరీక్షణకు చిత్ర బృందం ఇప్పుడు ట్రైలర్ రూపంలో భారీ ట్రీట్ ని ఇచ్చేసారు. చాలా అంచనాలు పెట్టుకొని వచ్చిన ఈ ట్రైలర్ మాత్రం అంచనాలకు మించే ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ లో మహేష్ బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ గా మారిపోయింది.

లుక్స్ పరంగా ట్రీట్ అనుకుంటే ఈ సినిమాలో తన రోల్ తో ఇంకా క్రేజీ ట్రీట్ ని మహేష్ అందించాడు. ఇక ఇది పక్కన పెడితే హీరోయిన్ కీర్తి సురేష్ తో కెమిస్ట్రీ అదిరిపోయింది. ఆమె మంచి గ్లామర్ గా కనిపించి ఆకట్టుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మహేష్ నుంచి కాస్త అడల్ట్ హ్యూమర్ కూడా గట్టిగానే ఉండేలా ఉందని చెప్పాలి. సరే ఇవి పక్కన పెడితే ట్రైలర్ లో మంచి కథ దాని ఎమోషన్స్ కూడా బలంగా కనిపిస్తున్నాయి.

Sarkaru Vaari Paata Official Trailer | Mahesh Babu | Keerthy Suresh | Thaman S | Parasuram Petla

 

మహేష్ రోల్ ఎంత ఫన్నీ గా ఉన్నా డబ్బు విషయంలో కి వస్తే మరో రకం మహేష్ కనిపిస్తున్నాడు. ఆ మాస్ గాని ఏక్షన్ గాని నెవర్ బిఫోర్ ఉన్నాయి. మరి ఈ ట్రైలర్ లో ఇవన్నీ ఒకెత్తు అయితే ఈ ట్రైలర్ లోనే ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పిన డైలాగ్ అయితే వారి అభిమానులకు మంచి ట్రీట్ తో పాటుగా ట్రైలర్ హైలైట్ గా కూడా మారింది.

ఇక ఫైనల్ గా మాత్రం నిజంగానే రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఒక బెస్ట్ ట్రైలర్ కట్ ఇది అని చెప్పాలి. ఇంకా ఈ ట్రైలర్ లో సంగీత దర్శకుడు థమన్ స్కోర్ కూడా మంచి ఆకర్షణగా ఉంది. ఇక ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 ఎంటర్టైన్మెంట్స్ వారితో మహేష్ సంయుక్తంగా నిర్మించారు.